ప్రచారానికి వస్తున్నాం: కమల్‌హాసన్

ABN , First Publish Date - 2021-02-27T21:20:06+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్న 'మక్కల్ నీది మయ్యం'..

ప్రచారానికి వస్తున్నాం: కమల్‌హాసన్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్న 'మక్కల్ నీది మయ్యం' ఎన్నికల ప్రచార తేదీని ప్రకటించింది. మార్చి 3న ఎన్నికల ప్రచారానికి తాను శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ చీఫ్ కమల్‌హాసన్ తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారాన్ని షురూ చేస్తున్నామని చెప్పారు. పొత్తుల విషయం ఖరారు కాగానే ఆ విషయం ప్రకటిస్తామని అన్నారు. మార్చి 7వ తేదీన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న్టటు ఎలక్షన్ కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వచ్చింది. కాగా, రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, కమల్‌హాసన్ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉండచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Updated Date - 2021-02-27T21:20:06+05:30 IST