ఆగస్టు 1వ తేదీకల్లా ప్రభుత్వ బంగళా ఖాళీ చేస్తా : ప్రియాంకాగాంధీ
ABN , First Publish Date - 2020-07-14T16:51:31+05:30 IST
ఢిల్లీ లోధి రోడ్లోని ప్రభుత్వ బంగళా ఖాళీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మంగళవారం స్పష్టమైన ప్రకటన చేశారు....
న్యూఢిల్లీ : ఢిల్లీ లోధి రోడ్లోని ప్రభుత్వ బంగళా ఖాళీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మంగళవారం స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం బంగళా ఖాళీ చేయాలని కోరుతూ జారీ చేసిన నోటీసు ప్రకారం తాను ఆగస్టు 1వతేదీకల్లా 35 లోథిఎస్టేట్ బంగళాను ఖాళీచేస్తానని ప్రియాంకాగాంధీ చెప్పారు. ప్రభుత్వ భవనంలో తనను కొనసాగనివ్వాలని తాను కేంద్రాన్ని కోరినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని ఆమె చెప్పారు. ప్రియాంకా గాంధీ గడువుకు ముందే ఢిల్లీలోని లోథీరోడ్ లోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేస్తున్నారు. ప్రియాంకాగాంధీ తన వ్యక్తిగత సామాన్లను తన తల్లి సోనియాగాంధీ నివాసమున్న జనపథ్ లోని 10వ నంబరు బంగళాకు తరలిస్తున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఆగస్టు 1 నాటికి ఖాళీ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రియాంక లోధి ఎస్టేట్లోని 35వ నెంబర్ ప్రభుత్వ బంగ్లాలో నివాసముంటోంది. ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించింది. ఈ నేపథ్యంలో లోథీ రోడ్లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది.దీంతో ప్రియాంకా తన లోథి రోడ్ లోని తన ఇంటి సామాన్లను తల్లి ఇంటికి తరలించారు. ప్రియాంకా వాద్రా తన మకాంను యూపీ లక్నో నగరానికి మకాం మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందిరాగాంధీ సమీపబంధువు అయిన కేంద్ర మాజీ మంత్రి షీలాకౌల్ లక్నోలో ఓ భవనముంది. కౌల్ హౌస్ బంగళాను ప్రియాంక నివాసముండేందుకు దాన్ని తాజాగా మరమ్మతులు చేయించారని లక్నో కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.