గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే ఆల

ABN , First Publish Date - 2021-06-18T05:03:41+05:30 IST

మండలంలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌ అన్నారు.

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే ఆల
నూతన గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే ఆల

దేవరకద్ర,  జూన్‌ 17 : మండలంలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌ అన్నారు. గురు వారం మండల కేంద్రంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరినందున నూతన గ్రంథాలయ నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగా యని తెలిపారు. రూ.38 లక్షలతో నూతన గ్రంథాలయాన్ని నిర్మించి పాఠకులకు అన్ని రకాల పుస్తకాలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మండల పరిధి లోని బస్వాపూర్‌ గ్రామాంల్లో నూతన చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ అన్నపూర్ణ, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


బాధిత కుటుంబానికి పరామర్శ 


మూసాపేట : మండల కేంద్రమైన మూసాపేట బీసీ కాలనీకి చెందిన శంకరయ్య పది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రాగడ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుడి చిత్రపటానికి పూలతో నివాళ్లు అర్పించారు ఆయన వెంట జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు జమీర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ యాదవ్‌, నాయకులు కొండయ్య, టైలర్‌ కలీం పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:03:41+05:30 IST