పేదల కోసం నిరంతరాయంగా పనిచేస్తా...

ABN , First Publish Date - 2022-01-19T04:52:22+05:30 IST

పేద ప్రజల కోసం నిరంతరాయంగా పని చేస్తామని రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి పేర్కొన్నారు.

పేదల కోసం నిరంతరాయంగా పనిచేస్తా...
పేదల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎంపీ మిధున్‌రెడ్డి

రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి


రైల్వేకోడూరు, జనవరి 18: పేద ప్రజల కోసం నిరంతరాయంగా పని చేస్తామని రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రైల్వేకోడూరు వైసీపీ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు  అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా అభాసుపాలు చేయడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని తెలిపారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముప్పాల హేమనవర్మ, రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్‌ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, రైల్వేకోడూరు వైస్‌ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T04:52:22+05:30 IST