Cricket: వరుసగా రెండో టీ20లోనూ దుమ్మురేపిన విండీస్

ABN , First Publish Date - 2021-07-11T21:34:54+05:30 IST

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో గత రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ చెలరేగి

Cricket: వరుసగా రెండో టీ20లోనూ దుమ్మురేపిన విండీస్

సెయింట్ లూసియా: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో గత రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ చెలరేగి ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెట్మెయిర్ చెలరేగి పోయాడు. 36 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్మెయిర్ 2 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. డీజే బ్రావో 47 పరుగులు (నాటౌట్) చేయగా, చివర్లో రస్సెల్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు (నాటౌట్) చేశాడు. ఓపెనర్ సిమన్స్ 30 పరుగులు చేశాడు. 


197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో మిచెల్ మార్ష్ 54 పరుగులు చేయగా, హెన్రిక్స్ 19, జోష్ ఫిలిప్ 13 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. విండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ 3 వికెట్లు పడగొట్టగా, కాట్రెల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఎడ్వర్డ్స్, రసెల్, బ్రావో, గేల్ చెరో వికెట్ తీసుకున్నారు. విండీస్‌కు ఇది వరుసగా రెండో విజయం. ఈ నెల 9న జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Updated Date - 2021-07-11T21:34:54+05:30 IST