అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-08-02T04:38:00+05:30 IST

మద్యం అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 85 మద్యం సీసాలను లింగసముద్రం పోలీసు లు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
మద్యం బాటిళ్లు, నిందితుడ్ని చూపిస్తున్న ఎస్‌ఐ రమేష్‌, పోలీసులు

నిందితుడి అరెస్ట్‌

లింగసముద్రం, ఆగస్టు 1 : మద్యం  అక్రమంగా  తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 85 మద్యం సీసాలను లింగసముద్రం పోలీసు లు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. మొగిలిచెర్లకు చెందిన వేముల మాల్యాద్రి మధ్యాహ్నం 3 గంటల సమయంలో పామూరులో మద్యం కొనుగోలు చేసుకొని తెస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్‌.రమేష్‌, పోలీస్‌ సిబ్బందితో మాలకొండ, మొగిలిచెర్ల మధ్య మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని, ద్విచక్ర వాహనంతో పాటు మద్యం బాటిళ్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాల్యాద్రి వద్ద సుమారు 85 క్వార్టర్‌ బాటిళ్ల మద్యంసీసాలు ఉన్నాయి. వీటి విలువ రూ.13,300 ఉంటుందని ఎస్సై రమేష్‌ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని  చెప్పారు. 

Updated Date - 2021-08-02T04:38:00+05:30 IST