వైసీపీ నేతలకు జ్ఞానం ప్రసాదించాలి

ABN , First Publish Date - 2021-06-16T08:51:18+05:30 IST

వైసీపీ నేతలు, మంత్రులకు జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నానని కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు

వైసీపీ నేతలకు జ్ఞానం ప్రసాదించాలి

పైడితల్లి అమ్మవారిని అదే కోరుకున్నా అశోక్‌ గజపతిరాజు

ఏడాది తర్వాత ఆలయంలోకి వెళ్లి దర్శనం 


విజయనగరం రూరల్‌, జూన్‌ 15: వైసీపీ నేతలు, మంత్రులకు జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నానని కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. ఏడాది విరామం తరువాత మంగళవారం ఆయన పైడిమాంబ అమ్మవారిని ఆలయంలో దర్శించుకున్నారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కుమార్తె అదితి, టీడీపీ నేతలతో కలసి చదురుగుడికి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. కుట్రపూరితంగా, దొడ్డిదారిన జీవోలు తెచ్చి తనను డిస్మిస్‌ చేశారన్నారు. ఆలయాలతో పాటు మాన్సాస్‌ ట్రస్టు నుంచి కూడా డిస్మిస్‌ చేయడం బాధ కలిగించిందన్నారు. దాదాపు ఏడాది తరువాత హైకోర్టు మంచి తీర్పు ఇచ్చిందన్నారు. తీర్పు పట్ల తాను పూర్తి సంతృప్తితో ఉన్నానన్నారు. మాన్సాస్‌, సింహాచలం దేవస్థానంలో ఏడాదిగా ఏం జరిగిందో తెలుసుకుంటానన్నారు.

Updated Date - 2021-06-16T08:51:18+05:30 IST