డీజీపీకి ప్రముఖుల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-04-09T09:39:46+05:30 IST

రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డికి పలువురు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఓ సర్వేలో దేశంలో 25 మంది అత్యుత్తమ ఐపీఎస్‌ అధికారుల్లో మహేందర్‌ రెడ్డి ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయనను అభినందిస్తూ

డీజీపీకి ప్రముఖుల శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డికి పలువురు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఓ సర్వేలో దేశంలో 25 మంది అత్యుత్తమ ఐపీఎస్‌ అధికారుల్లో మహేందర్‌ రెడ్డి ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయనను అభినందిస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల సేవలను అభినందిస్తూ సినీనటుడు నాగ చైతన్య ఓ వీడియో విడుదల చేశాడు.

Updated Date - 2020-04-09T09:39:46+05:30 IST