బ్రెజిల్ను వణికిస్తున్న మహమ్మారి.. ఒకేరోజు..
ABN , First Publish Date - 2020-08-04T20:23:56+05:30 IST
బ్రెజిల్లో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్లో భారీగా
బ్రసిలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్లో భారీగా 16,641 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 27,50,318కు చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో బ్రెజిల్లో మొత్తం 561 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 94,665గా ఉంది. బ్రెజిల్లోని సావొపాలో రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. బ్రెజిల్లో అత్యధిక జనాభా కలిగి ఉన్న రాష్ట్రం ఇదే కావడంతో ఇక్కడ కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటివరకు 5 లక్షల 60 వేల కేసులు నమోదు కాగా.. 23,365 మంది మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రం తరువాత రియో డి జనైరోలో 1,68,064 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఈ రాష్ట్రంలో 13,604 మంది మరణించారు. లాటిన్ అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో నిలించింది. అత్యధిక కేసులు జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. అమెరికా తరువాతి స్థానాల్లో బ్రెజిల్, భారత్, రష్యా, దక్షిణ ఆఫ్రికా దేశాలున్నాయి.