బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి

ABN , First Publish Date - 2020-08-03T10:33:18+05:30 IST

బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాధ్‌రావు

బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి

దండేపల్లి, ఆగస్టు 2 : బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాధ్‌రావు వెరబెల్లి అన్నారు. గూ డెం, వెల్గనూర్‌, కర్ణపేట గ్రామానికి చెందిన యువ కులు ఆదివారం బీజేపీలో చేరారు. వెరబెల్లి మాట్లా డుతూ దేశంలో అవినీతిరహితపాలన ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు. మోదీ సందేశ కరపత్రా లను ఇంటింటా పంచుతూ ప్రచారం చేశారు. మం డల అధ్యక్షుడు గోపతి రాజయ్య,  పట్టి వెంకటకృ ష్ణ, హరికృష్ణ, రవిగౌడ్‌, సతీష్‌, రవి, పాల్గొన్నారు. 


బీజేపీలో చేరిన మాజీ వార్డు కౌన్సిలర్‌ 

ఏసీసీ: బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ ఆధ్వర్యంలో ఆదివారం సమావే శం నిర్వహించారు.  23వ వార్డు మాజీ కౌన్సిలర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు చిర్ర గౌరీప్రియతో పాటు ఆమె అనుచరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలకు ఉపయోగప డే పథకాలను చూసి బీజేపీలో చేరుతున్నట్లు తెలి పారు. రఘునాథ్‌ మాట్లాడుతూ రానున్న కాలంలో  మహిళ మోర్చాను పటిష్టం చేస్తామన్నారు. పట్టణ అఽధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్‌ రావు, ముదాం మల్లేష్‌, పచ్చ వెంకటేశ్వర్లు, బోయిని లలిత, వేకం డర్‌ వాణి, పచ్చ స్వప్నరాణి పాల్గొన్నారు. 


జైపూర్‌: మండలంలోని ఎల్కంటి, రామారావు పేట గ్రామాలకు చెందిన యువకులు యువ మో ర్చ జిల్లా అధ్యక్షుడు పత్తి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో యువకులు పార్టిలో చేరారు.  గుర్రపు శ్రీధర్‌ ను మండల యువమోర్చ ఉపాధ్యక్షుడిగా, బేతు విజ య్‌ను మండల కార్యదర్శిగా ప్రకటించారు. చల్ల విశ్వంబర్‌ రెడ్డి, చేగొండ శ్రీనివాస్‌, బల్ల వెంకటేష్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T10:33:18+05:30 IST