కోయంబేడు లింక్తో.. ఏడుగురికి?
ABN , First Publish Date - 2020-06-06T09:16:47+05:30 IST
గుంటూరు నగరంలోని ఏటుకూరు బైపాసు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హోల్సేల్ పండ్ల మార్కెట్లో గత
గుంటూరు : గుంటూరు నగరంలోని ఏటుకూరు బైపాసు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హోల్సేల్ పండ్ల మార్కెట్లో గత ఆదివారం 95 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వారిలో ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ వివరాలు ఇంకా బయటకి రాలేదు. శ్రీనివాసరావుపేట అర్బన్ హెల్త్ సెంటర్లో 96 మందికి ఈ వారం మొదట్లో కరోన టెస్టులు నిర్వహించారు. ప్రతీ గురువారం ల్యాబ్కు సెలవు కావడంతో వాటి రిపోర్టులు శుక్రవారం విడుదల అవుతాయని అంతా భావించారు.
అధికారవర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో హోల్సేల్ వ్యాపారి అయిన గుంటూరు సంపత్నగర్కు చెందిన వ్యక్తికి పాజిటివ్ అని చూపించారు. శ్రీనివాసరావుపేటలో పాజిటివ్ కేసు కాంటాక్ట్స్ని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు క్వారంటైన్కు తరలించాయి. ఇటీవల కొత్తగా నాలుగు పాజిటివ్ కేసలు ఇక్కడ నమోదయ్యాయి. దాంతో వారి ప్రాథమిక సంబంధీకులను గుర్తించి క్వారంటైన్కు తరలించారు. ద్వితీయ సంబంధీకులను మాత్రం ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించారు. కేసు నమోదైన వీధులను బ్యారికేడింగ్తో కట్టడి చేశారు.