తీసుకునేది నగదు... చెల్లింపులు మాత్రం డిజిటల్‌గా... కరోనా ఎఫఎక్ట్...

ABN , First Publish Date - 2021-05-17T21:37:22+05:30 IST

ఏటీఎంల వద్ద బ్యాంకు ఖాతాదారులు క్యూలు కడుతున్నారు. దాదాపు ఏ ఏటీఎం చూసినా ఇదే పరిస్థితి.

తీసుకునేది నగదు... చెల్లింపులు మాత్రం డిజిటల్‌గా...  కరోనా ఎఫఎక్ట్...

ముంబై : ఏటీఎంల వద్ద బ్యాంకు ఖాతాదారులు క్యూలు కడుతున్నారు. దాదాపు ఏ ఏటీఎం చూసినా ఇదే పరిస్థితి. ఎందుకంటే... బ్యాంకులు, ఏటీఎంలకు వెళితే... కరోనా తాకిడికి గురవుతామన్న ఆందోళనే. మరోవైపు కేవైసీ నిబంధనలతో ఆసుపత్రులు వంటి వాటిల్లో రూ. 2 లక్షలకు మించి నగదు చెల్లింపులకు అనుమతులుంటుండడం ఇందుకు కారణమవుతోంది.


నగదు వినియోగానికి సంబంధించి కరోనా నేపధ్యంలో ప్రజల ప్రవర్తనలో స్పష్టమైన మార్పును తీసుకు వచ్చినట్లుగా పరిస్థితులు చెబుతున్నాయి. ఏటీఎంల నుండి పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేసుకుంటోన్న నగదును... ఖాతాదారులు అట్టిపెట్టుకుంటున్నారు. మరోవైపు... చెల్లింపులను మాత్రం డిజిటల్ రూపాల్లో చేస్తున్నారు. రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ, డిజిటల్ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ... ఇటీవలి కాలంలో 20 శాతం మేర పెరిగిందని, అదే క్రమంలో... మరోవైపు డిజిటల్ చెల్లింపులు కూడా పెరిగాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-05-17T21:37:22+05:30 IST