పొరబాటున పిల్లాడిని, సోదరిని చంపేసిన మహిళ!

ABN , First Publish Date - 2021-02-25T11:17:11+05:30 IST

పొరబాటున తన ఐదేళ్ల కుమారుడిని, 19 ఏళ్ల సోదరిని చంపేసిందో మహిళ. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది.

పొరబాటున పిల్లాడిని, సోదరిని చంపేసిన మహిళ!

తిరువనంతపురం: పొరబాటున తన ఐదేళ్ల కుమారుడిని, 19 ఏళ్ల సోదరిని చంపేసిందో మహిళ. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఎలుకల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకుంది. ఎలుకల మందు తెచ్చుకొని ఐస్‌క్రీమ్‌లో కలుపుకొని తాగింది. అయితే ఆ ఐస్‌క్రీమ్‌లో కొంత భాగాన్ని బయటే పెట్టి మర్చిపోయింది. దానిలో విషం ఉందనే విషయం తెలియని ఆ మహిళ కుమారుడు, ఆమె సోదరి ఐస్‌క్రీమ్ తినేశారు. వాళ్లిద్దరూ మరణించగా.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ఆ మహిళ మాత్రం ప్రాణాలు నిలుపుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-02-25T11:17:11+05:30 IST