రన్నింగ్ ట్రైన్ నుంచి భార్యను తోసేసిన భర్త

ABN , First Publish Date - 2021-01-14T22:13:06+05:30 IST

తీవ్రంగా గాయాలపాలైన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆ సమయంలో వారు మద్యపానం ఏమైనా తీసుకుని..

రన్నింగ్ ట్రైన్ నుంచి భార్యను తోసేసిన భర్త

ముంబై: పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు. ప్రయాణిస్తున్న రైలు నుంచి భార్యను కిందకు తోసేశాడో ప్రబుద్ధుడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో సోమవారం జరిగిందీ సంఘటన. అదే రైలులో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని చెంబూరు, గోవండి రైల్వే స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది.


ఇద్దరు భార్యాభర్తలు మానఖుర్ద్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భార్యకు అంతకు ముందే పెళ్లై ఏడేళ్ల పాప ఉంది. ప్రమాదం జరిగే నాటికి ఆ పాపా వారితో పాటే అదే రైలులో ఉంది. సోమవారంనాటు భార్యాభర్తలు తమ ఏడేళ్ల చిన్నారితో లోకల్‌ రైలులో చెంబూరు నుంచి గోవండి వెళ్తున్నారు. ఇద్దరు రైలు తలుపు వద్ద బయటికి లోపలికి ఊగుతూ కాసేపు గడిపారు. భార్య తలుపు బయటికి ముఖం పెట్టబోతుండగా ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు భర్త. తలుపు బయటికి ఉన్న ఆమెను అంతలోనే వదిలేశాడు. రైలును గోవండి స్టేషన్ వద్ద ఆపి రైల్వే పోలీసులకు ఒక ప్రయాణికురాలు సమాచారం అందించారు.


తీవ్రంగా గాయాలపాలైన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆ సమయంలో వారు మద్యపానం ఏమైనా తీసుకుని ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భార్యను ఉద్దేశపూర్వకంగానే బయట తోసేశాడని అదే రైలులో ఉన్న ప్రయాణికులు చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-01-14T22:13:06+05:30 IST