ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ABN , First Publish Date - 2020-05-07T12:01:07+05:30 IST

ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఇంట్లో నిద్రపోతున్న భర్తను చంపిన దారుణ ఘటన....

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

న్యూఢిల్లీ : ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఇంట్లో నిద్రపోతున్న భర్తను చంపిన దారుణ ఘటన ఢిల్లీ నగరంలో వెలుగుచూసింది. ఢిల్లీలోని జేలార్ వాలాబాగ్ ప్రాంతానికి చెందిన శరత్ దాస్, అనితలు భార్యాభర్తలు. అనిత పొరుగింట్లో ఉన్న సంజయ్ తో అక్రమసంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు అనిత ప్రియుడైన సంజయ్ తో కలిసి భర్తను హతమార్చింది. అనిత ప్రియుడ్ని పిలిచి అతనితో కలిసి నిద్రపోతున్న భర్తకు దుప్పటితో గాలి ఆడకుండా చేసి హతమార్చింది. తన భర్త కరోనా వైరస్ తో మరణించాడని అనిత పొరుగింటివారితో చెప్పింది. పోలీసులు అనుమానంతో శరత్ దాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా ఊపిరాడకుండా చేసి హతమార్చారని తేలింది. దీంతో అనిత, సంజయ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-05-07T12:01:07+05:30 IST