కరోనా భయం కడతేర్చింది.. విషం తాగి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-06T23:01:33+05:30 IST

కరోనా భయంతో ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని...

కరోనా భయం కడతేర్చింది.. విషం తాగి మహిళ ఆత్మహత్య

ఫగ్వారా: కరోనా భయంతో ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని ఫగ్వారా జిల్లా, ఖుర్రంపూర్ గ్రామంలో నివశించే సంతోష్ కౌర్ అనే మహిళ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దగ్గు, జ్వరం ఉండడంతో ఆమె దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. అయితే తనకు కరోనా సోకిందేమోనన్న భయం ఆమెను ఆవరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

Updated Date - 2020-04-06T23:01:33+05:30 IST