వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం?
ABN , First Publish Date - 2021-12-08T01:54:28+05:30 IST
అధికారుల, నాయకుల వేధింపులను భరించలేక ఓ మహిళ
నెల్లూరు: అధికారుల, నాయకుల వేధింపులను భరించలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాకకు చెందిన వాణి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పొలం వివాదంలో వైసీపీ నేతల, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. జలదంకి పీఎస్లో ఫిర్యాదు చేశారు.