లాక్డౌన్ వేళ పోలీసు వ్యాన్లో మహిళ ప్రసవం
ABN , First Publish Date - 2020-04-09T11:17:59+05:30 IST
పోలీసువ్యానులో ఆ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించిన ఘటన ....
న్యూఢిల్లీ : ఓ గర్భిణీ పురిటినొప్పులతో బాధపడుతుందని పోలీసు కంట్రోల్ రూంకు అందిన సమాచారంతో పోలీసువ్యానులో ఆ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఈస్ట్ కిద్వాయ్ నగర్లో బుధవారం రాత్రి వెలుగుచూసింది.ఈస్ట్ కిద్వాయ్ నగర్ ప్రాంతానికి చెందిన మంజరీ ఖాతూన్ (28) అనే గర్భిణీకి పురిటి నొప్పులతో బాధపడుతుందని బుధవారం రాత్రి కోట్లముబారక్ పూర్ పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు తమ వ్యానులో గర్భిణీ ఇంటికి వెళ్లి ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో వ్యానులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. పోలీసులు తల్లీ బిడ్డలను సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు.