కాళంగినదిలో పడి మహిళ మృతి
ABN , First Publish Date - 2021-06-22T03:28:58+05:30 IST
సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సమీపంలోని కాళంగి నదిలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడి మృతిచెందింది.
సూళ్లూరుపేట, జూన్ 21 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సమీపంలోని కాళంగి నదిలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడి మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. సుమారు 35ఏళ్లు ఉన్న ఓ మహిళ నదిలో స్నానానికి దిగి మునిగిపోవడం చూసిన ఆ ప్రాంతవాసులు స్థానిక అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెళ్లేసరికి ఆమె మృతిచెందింది. మహిళ మృతదేహాన్ని బయటకుతీశారు. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ ప్రాంతంలో చెత్తఏరుకునే మహిళగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.