ఆర్టీసీ బస్సులో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-10-15T05:24:02+05:30 IST
చీరాల నుంచి ఒంగోలు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకస్మికంగా మృతి చెందారు.
నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్), అక్టోబరు 14: చీరాల నుంచి ఒంగోలు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకస్మికంగా మృతి చెందారు. చిన్నగంజాంలోని అంబేడ్కర్ నగర్కు చెందిర మేడికొండ మధుమతి (50) గురువారం ఒంగోలు వచ్చేందుకు ఉప్పగుండూ రు సమీపంలోని టోల్గేట్ వద్ద బస్సు ఎక్కారు. అయితే బస్సు ఉప్పగుండూరుకు చేరుకునే స మయానికి మధుమతికి గుండెపోటు వచ్చి ఒక్కసారిగా సీటులోనే పడిపోయి మృతి చెందారు. దీంతో కండెక్టర్ నాగులుప్పలపాడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించా రు. మృతురాలి కుటుంబసభ్యులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు.