12 ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స అందక మహిళ మృతి!

ABN , First Publish Date - 2020-07-06T00:44:56+05:30 IST

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళకు చికిత్స చేయడానికి 12 ఆస్పత్రులు నిరాకరించాయి.

12 ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స అందక మహిళ మృతి!

బెంగళూరు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళకు చికిత్స చేయడానికి 12 ఆస్పత్రులు నిరాకరించాయి. చిట్టచివరకు ఓ ఆస్పత్రిలో చేరిన నిమిషాల్లోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివశించే ఓ 50ఏళ్ల మహిళకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె భర్త బాబు ఆందోళన చెందాడు. భార్యను తీసుకొని చాలా ఆస్పత్రులకు తిరిగాడు. అయితే ఈ ఆస్పత్రులేవీ ఆమెను చేర్చుకొని చికిత్స చేయడానికి అంగీకరించలేదు. చివరకు కేసీ జనరల్ హాస్పిటల్‌లో చేరిన ఆమె కాసేపటికే కన్నుమూసింది. ‘మూడ్రోజులుగా నా భార్య శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. విక్టోరియా సహా చాలా ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. బెడ్లు ఖాళీ లేవంటూ నా భార్యను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వాళ్లు నిరాకరించారు. చివరకు ఆమె చనిపోయింది’ అని బాబు వాపోయారు.

Updated Date - 2020-07-06T00:44:56+05:30 IST