బావిలో పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-18T04:34:02+05:30 IST

దుస్తులు ఉతికేందుకు బావివద్దకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో ఆదివారం వెలుగు చూసింది.

బావిలో పడి మహిళ మృతి

 అల్లాదుర్గం, అక్టోబరు 17: దుస్తులు ఉతికేందుకు బావివద్దకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిన సంఘటన  మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో ఆదివారం వెలుగు చూసింది. అల్లాదుర్గం ట్రెయినీ ఎస్‌ఐ స్నేహ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అప్పాజీపల్లి శివమ్మ(53) శనివారం సాయంత్రం దుస్తులు ఉతికేందుకు సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. దుస్తులు ఉతికే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయింది. రాత్రయినా తిరిగిరావకపోవడంతో ఆదివారం కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా బావిలో మృతదేహమై కనిపించింది. మృతురాలి కుమారుడు భేతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అల్లాదుర్గం ట్రెయినీ ఎస్‌ఐ స్నేహ వెల్లడించారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఆమె తెలిపారు.


 

Updated Date - 2021-10-18T04:34:02+05:30 IST