కరోనా అని తేలిన తర్వాత.. దుబాయి ప్రయాణం!

ABN , First Publish Date - 2020-07-22T04:10:30+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.

కరోనా అని తేలిన తర్వాత.. దుబాయి ప్రయాణం!

పూణే: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ముంబై, పూణే నగరాల్లో పరిస్థితిని అదుపు చేయడానికి అధికారులు నానాతిప్పలూ పడుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా అని తేలిన తర్వాత కూడా ఓ మహిళ దుబాయికి వెళ్లింది. పూణేకు చెందిన ఈమెకు కరోనా సోకినట్లు జూలై 11న వెల్లడయింది. అయితే ఆమెలో వ్యాధి లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెను 14రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేసిన సదరు మహిళ.. దుబాయి వెళ్లింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళ యూఏఈ నివాసి అని తెలిపారు.

Updated Date - 2020-07-22T04:10:30+05:30 IST