మహిళకు లిఫ్టు ఇస్తామంటూ దారుణం...ఏడుగురి అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-08-21T18:03:52+05:30 IST

బస్సు కోసం వేచి చూస్తున్న 32 ఏళ్ల వయసుగల ఓ మహిళకు లిఫ్టు ఇస్తామని చెప్పి కోళ్ల ఫారంలోకి తీసుకువెళ్లి ఆమెపై ఏడుగురు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన....

మహిళకు లిఫ్టు ఇస్తామంటూ దారుణం...ఏడుగురి అఘాయిత్యం

చండీఘడ్ (హిమాచల్ ప్రదేశ్): బస్సు కోసం వేచి చూస్తున్న 32 ఏళ్ల వయసుగల ఓ మహిళకు లిఫ్టు ఇస్తామని చెప్పి కోళ్ల ఫారంలోకి తీసుకువెళ్లి ఆమెపై ఏడుగురు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా పట్టణంలో గురువారం వెలుగుచూసింది. కంగ్రా పట్టణంలోని బనోయ్ ప్రాంతంలో 32 ఏళ్ల మహిళ బస్సు కోసం వేచి ఉంది. అంతలో ఏడుగురు యువకులున్న కారు అటువైపు వచ్చి లిఫ్టు ఇస్తామంటూ చెప్పి సలోల్ పౌల్ట్రీ ఫాంకు తీసుకువెళ్లి ఆమెపై ఏడుగురు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఎంసిలీడ్జగంజ్ హోటల్ కు తీసుకువెళ్లి మరో సారి ఆమెపై దుండగులు అఘాయిత్యం చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేర కంగ్రా పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. హోటల్ యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించారు. బాధిత మహిళ వివాహిత అని, ఆమెకు ముగ్గురు పిల్లలున్నారని, గత ఐదేళ్లుగా ఆమె భర్తకు దూరంగా విడిగా నివాసముంటుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులంతా కంగ్రా సమీపగ్రామాలకు చెందిన వారని పోలీసులు చెప్పారు. 

 

Updated Date - 2020-08-21T18:03:52+05:30 IST