చికిత్స చేయించుకోవడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి..

ABN , First Publish Date - 2022-01-26T17:06:47+05:30 IST

అతను మెడికల్ షాప్ నడుపుతున్నాడు.. పక్కనే గదిలో పేషెంట్లకు చికిత్స కూడా చేస్తున్నాడు..

చికిత్స చేయించుకోవడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి..

అతను మెడికల్ షాప్ నడుపుతున్నాడు.. పక్కనే గదిలో పేషెంట్లకు చికిత్స కూడా చేస్తున్నాడు.. ఇటీవల ఓ వివాహిత అతడి వద్దకు చికిత్స చేయించుకోవడానికి వెళ్లింది.. ఆమెను గదిలోకి తీసుకెళ్లిన అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.. చికిత్స పేరుతో ఆమె ప్రైవేట్ భాగాలను తాకడానికి ప్రయత్నించాడు.. అనుమానం వచ్చిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దర్యాఫ్తు చేసిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. 


తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని హనుమంతపురంలో షణ్ముగం అనే యువకుడు మందుల షాపు నడుపుతున్నాడు. పక్కనే మరో గదిలో క్లినిక్ ఏర్పాటు చేసి పేషెంట్లకు చికిత్స కూడా చేస్తున్నాడు. సోమవారం ఉదయం సొన్నంపట్టి ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి షణ్ముగం దగ్గరకు వెళ్లాడు. ఆమె అనారోగ్యంతో ఉందని, చికిత్స చేయాలని అడిగాడు. ఆమెను గదిలోకి తీసుకెళ్లిన షణ్ముగం అసభ్యంగా ప్రవర్తించాడు. చికిత్స పేరుతో ఆమె రహస్యాంగాలను తాకాడు. దీంతో ఆమె గట్టిగా కేకలేసింది. 


భార్య ద్వారా విషయం తెలుసుకున్న మదన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి షణ్ముగంపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షణ్ముగంను విచారించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. షణ్ముగంకు కనీసం ఆర్‌ఎంపీ సర్టిఫికెట్ కూడా లేదని, అతను నకిలీ డాక్టర్ అని, తనకు తెలిసిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని తేలింది. దీంతో షణ్ముగంను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.  


Updated Date - 2022-01-26T17:06:47+05:30 IST