నెలరోజుల వయసు కుమార్తెను చంపిన కసాయి తల్లి

ABN , First Publish Date - 2020-09-19T15:51:18+05:30 IST

పేగు తెంచుకు పుట్టిన ఆడబిడ్డను నీళ్లట్యాంకులో పడేసి చంపిన కసాయి తల్లి బాగోతం...

నెలరోజుల వయసు కుమార్తెను చంపిన కసాయి తల్లి

భోపాల్ (మధ్యప్రదేశ్): పేగు తెంచుకు పుట్టిన ఆడబిడ్డను నీళ్లట్యాంకులో పడేసి చంపిన కసాయి తల్లి బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర సమీపంలోని డెహ్రియా ఖాజూరి గ్రామంలో వెలుగుచూసింది. డెహ్రియా ఖాజూరి గ్రామానికి చెందిన సరితా, సచిన్ ను సంవత్సరం క్రితం వివాహమాడింది. ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. తనకు ఆడబిడ్డ పుట్టడం వల్ల అత్తమామలు అసంతృప్తితో ఉన్నారని,  తనకు మగబిడ్డ కావాలనుకున్న సరిత నెలరోజుల వయసున్న ఆడబిడ్డను నీళ్లట్యాంకులో పడేసి మూతపెట్టింది. 


అనంతరం తన పసిబిడ్డ కనిపించడం లేదని శిశువు తండ్రి సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా నీళ్లట్యాంకులో మృతదేహం కనిపించింది. తన కూతుర్ని తానే హతమార్చానని సరిత అంగీకరించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. మగపిల్లాడి కోసమే ఆడపిల్లను సరిత హతమార్చిందని తేలింది. దీంతో సరితపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశామని భోపాల్ డీఐజీ ఇర్షాద్ వాలి చెప్పారు. 

Updated Date - 2020-09-19T15:51:18+05:30 IST