పుట్టింటికి వెళ్దామనుకుంది.. భర్తనూ రమ్మని పట్టుబట్టింది.. వెళ్లడం ఇష్టం లేని భర్త ఎంత దారుణం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-12-22T17:52:07+05:30 IST

వారిద్దరికీ రెండేళ్ల క్రితం వివాహమైంది.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివసిస్తున్నారు..

పుట్టింటికి వెళ్దామనుకుంది.. భర్తనూ రమ్మని పట్టుబట్టింది.. వెళ్లడం ఇష్టం లేని భర్త ఎంత దారుణం చేశాడంటే..

వారిద్దరికీ రెండేళ్ల క్రితం వివాహమైంది.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివసిస్తున్నారు.. భార్య తన తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్దామనుకుంది.. భర్తను కూడా రమ్మని పట్టుబట్టింది.. భర్త రాననడంతో వాగ్వాదానికి దిగింది.. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన భర్త ఆమె గొంతు కోసి చంపేశాడు.. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. 


రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న కలీమ్ అలీ (24), షామా (22) మీరట్‌లో నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం షామా తన పుట్టింటికి వెళ్దామనుకుంది. కలీమ్‌ను కూడా రమ్మని అడిగింది. కలీమ్ రాననడంతో అతనితో వాగ్వాదానికి దిగింది. షామా సోదరుడు కూడా ఫోన్ చేసి కలీమ్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన కలీమ్.. భార్య గొంతు కోసం చంపేశాడు. షామా కేకలు విన్న చుట్టుపక్కల వారు వెళ్లి తలుపు కొట్టగా లోపలి నుంచి స్పందన లేదు. 


కొద్ది సేపటికి కలీమ్ తలుపు తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. `ఇప్పుడు వెళ్లి మీ అమ్మానాన్నతో ఉండు` అని అరుచుకుంటూ కలీమ్ బయటకు వెళ్లిపోయినట్టు చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రస్తుతం కలీమ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Updated Date - 2021-12-22T17:52:07+05:30 IST