రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2020-06-03T09:23:30+05:30 IST

రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతున్న ఘటన ఇల్లందలో మంగళవారం

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

వర్ధన్నపేట, జూన్‌ 2 : రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతున్న ఘటన  ఇల్లందలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఇల్లందకు రడపాక వాణి(27), బరిగెల కోమల బస్టాండ్‌ సెంటర్‌లో రోడ్డును క్రాస్‌ చేస్తున్న క్రమంలో వేగంగా వెళ్తున్న లారీ వీరిని ఉదయం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి వాణి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-03T09:23:30+05:30 IST