రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-25T05:33:04+05:30 IST

మండలంలోని వెల్లంకి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నూకల అబద్దం మృతదేహం

ఆనందపురం అక్టోబర్‌ 24: మండలంలోని వెల్లంకి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆనందపురం సీఐ వై.రవి తెలిపిన వివరాల ప్రకారం ఆరిలోవకు చెందిన నూకల అబద్దం (45) వెల్లంకి గ్రామంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆటోలో వచ్చింది. హైవేపై ఆటో దిగి రోడ్డు దాటుతున్న ఆమెను విశాఖ నుంచి తగరపువలస వైపు వెళుతున్న టాటా ఏసీ ఆటో బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ శ్యామ్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం తగిన చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-25T05:33:04+05:30 IST