అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం.. ఆపై భర్త గొంతుకోసి..

ABN , First Publish Date - 2020-04-04T21:47:54+05:30 IST

భర్తయినా.. భార్యయినా మన సమాజంలో అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరం. అయితే దీనిని ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట అతిక్రమిస్తూనే...

అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం.. ఆపై భర్త గొంతుకోసి..

లక్నో: భర్తయినా.. భార్యయినా మన సమాజంలో అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరం. అయితే దీనిని ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట అతిక్రమిస్తూనే ఉన్నారు. అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, దానికోసం సొంత భర్త ప్రాణాలనే తీసింది ఓ ప్రబుద్ధురాలు. ఆగ్రా జిల్లాలో బర్హన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖంద గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. మృతుడు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఒక వారం క్రితమే భార్య రవీన, కొడుకుతో గ్రామానికి వచ్చాడు. 


వీరి ఇంటిపక్కనే ప్రతాప్ అనే ఓ వ్యక్తి నివాసముంటున్నాడు. అతడు రవీనకు వరుసకు అన్నయ్య వరుసవుతాడు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన వారికి వావి వరుసలు తెలియవన్నట్లు.. ప్రతాప్‌తో రవీన అక్రమసంబంధం పెట్టుకుంది. దీనికోసం ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీనికి ప్రతాప్ కూడా సాయం చేశాడు. దీంతో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రవీన అత్యంత పాశవికంగా తన భర్త గొంతు కోసి చంపేసింది. 


విషయం తెలుసుకున్న పోలీసులు రవీనను అరెస్టు చేశారు. అయితే ప్రతాప్ మాత్రం పరారీలో ఉన్నాడు. దీనిపై బర్హన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మహేంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకునేసరికి మృతుడు గొంతు తెగి, రక్తపు మడుగులో పడి ఉన్నాడని, రవీన అదుపులోకి తీసుకుని ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రతాప్‌ను కూడా త్వరలో పట్టుకుంటామని, అయితే హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేదని, త్వరలోనే దానిని చేజిక్కించుకుంటామని తెలిపారు. 


ఇదిలా ఉంటే ఒక్క దురాలోచనతో పండంటి కాపురాన్ని నాశనం చేసుకున్న రవీన తన 1.5 ఏళ్ల కొడుకును అనాథను చేసి, ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతోంది.

Updated Date - 2020-04-04T21:47:54+05:30 IST