విషాదాంతంగా ముగిసిన లేడీ లెక్చరర్‌ జీవితం

ABN , First Publish Date - 2020-02-10T19:38:41+05:30 IST

మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం తను పనిచేస్తున్న...

విషాదాంతంగా ముగిసిన లేడీ లెక్చరర్‌ జీవితం

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే గత సోమవారం ఉదయం తను పనిచేస్తున్న కాలేజీకి వెళుతున్న అంకిత(24)పై వికేష్ నాగ్‌రాలే(27) అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమె శరీరంలోని అధిక భాగం కాలిపోయింది. ఆమెను నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటిలేటర్‌‌పై చికిత్సనందించిన వైద్యులు సోమవారం(10-02-2020) ఉదయం 7.43 నిమిషాలకు ఆమె చనిపోయినట్లు వెల్లడించారు.

Updated Date - 2020-02-10T19:38:41+05:30 IST