ట్రయల్ రూమ్ బయట మహిళ పర్సులో నుంచి లక్ష చోరీ!

ABN , First Publish Date - 2021-03-23T11:18:52+05:30 IST

దుస్తులు కొనుక్కుందామని మాల్‌కు వెళ్లిందా మహిళ. అలా చేయడం వల్ల తనకు అంత భారీ నష్టం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.

ట్రయల్ రూమ్ బయట మహిళ పర్సులో నుంచి లక్ష చోరీ!

నోయిడా: దుస్తులు కొనుక్కుందామని మాల్‌కు వెళ్లిందా మహిళ. అలా చేయడం వల్ల తనకు అంత భారీ నష్టం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఒక మహిళ షాపింగ్ చేయడం కోసం మాల్‌కు వెళ్లింది. అక్కడ ఒక దుకాణంలో దుస్తులు కొని ట్రయల్ వేద్దామని వెళ్లింది. అలా వెళ్లిన సమయంలో తన చేతిలోని పర్సును ట్రయల్ రూమ్ బయట తగిలించింది. ఆ తర్వాత దుస్తులు మార్చుకొని బయటకు వచ్చిన ఆమెకు భారీ షాక్ తగిలింది. బయట పెట్టిన పర్సులోని లక్ష రూపాయల సొమ్ము మాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాల్‌లో పనిచేసే సిబ్బందిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-03-23T11:18:52+05:30 IST