భర్త మరణించిన రెండో రోజే ఊహించని పరిణామం.. అతడి జ్ఞాపకాలతో బతికేస్తానని భార్య చెబుతున్నా..

ABN , First Publish Date - 2021-07-29T20:30:00+05:30 IST

ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టి కాపురం ప్రారంభించిన ఆమెకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు..

భర్త మరణించిన రెండో రోజే ఊహించని పరిణామం.. అతడి జ్ఞాపకాలతో బతికేస్తానని భార్య చెబుతున్నా..

ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టి కాపురం ప్రారంభించిన ఆమెకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. పెళ్లై సంవత్సరం కూడా గడవకముందే భర్త చనిపోయాడు.. పోనీ భర్త జ్ఞాపకాలతోనైనా గడపుదామనుకుంటే అత్తింట వారు అడ్డు తగులుతున్నారు.. భర్త చనిపోయిన రెండో రోజే ఆమెను ఇంటి నుంచి తరిమేశారు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది.


గ్వాలియర్‌కు చెందిన ప్రీతి గతేడాది జూన్ 1న రామావతార్‌ను వివాహం చేసుకుని అత్తింట అడుగుపెట్టింది. జీవితం సజావుగా సాగిపోతోందనుకునే దశలో రామావతార్ ఈ ఏడాది మే1న అనారోగ్యంతో మరణించాడు. రామావతార్ మరణించిన రెండో రోజే అత్తింటి వారు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ప్రీతిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదని బయటయకు తోసేశారు. ప్రీతి ఎంత బతిమాలినా వారు ఇంట్లోకి రానివ్వలేదు. 


కట్నం చాలా తక్కువ ఇచ్చారనే కారణంతో ప్రీతి అంటే ఆమె అత్తంట వారికి ముందు నుంచి ఇష్టం లేదు. తాజాగా రామావతార్ కూడా చనిపోవడంతో ప్రీతిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో ప్రీతి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రీతి అత్తింటి వారిని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-07-29T20:30:00+05:30 IST