పెళ్లింట్లోకి వెళ్లి టీ కావాలని అడిగింది.. టీ తెచ్చేసరికి అదృశ్యమైంది.. తర్వాత బీరువాలో చూసుకుంటే..

ABN , First Publish Date - 2022-01-27T18:32:23+05:30 IST

మరో నాలుగు రోజుల్లో పెళ్లి ఉండడంతో ఇల్లంతా సందడిగా ఉంది.. బంధుమిత్రులతో కళకళలాడుతోంది..

పెళ్లింట్లోకి వెళ్లి టీ కావాలని అడిగింది.. టీ తెచ్చేసరికి అదృశ్యమైంది.. తర్వాత బీరువాలో చూసుకుంటే..

మరో నాలుగు రోజుల్లో పెళ్లి ఉండడంతో ఇల్లంతా సందడిగా ఉంది.. బంధుమిత్రులతో కళకళలాడుతోంది.. ఇంతలో ఓ మహిళ నేరుగా బెడ్రూమ్‌లోకి వచ్చింది.. తెలిసిన వ్యక్తిలాగానే ఉండడంతో పెళ్లి కూతురి తల్లి ఆమెను కూర్చోబెట్టింది.. టీ తెస్తానని చెప్పి వంట గదిలోకి వెళ్లింది.. ఆమె టీ చేసి తిరిగి వచ్చేసరికి ఆ మహిళ కనిపించలేదు.. గంట తర్వాత బీరువా తీసి చూస్తే రూ.50 వేల నగదు, 10 తులాల బంగారం కనిపించలేదు.. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన సోమ అనే మహిళ కూతురుకు ఈ నెల 30న వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఓ మహిళ ఆ ఇంటికి వచ్చింది. ఎవరో బంధువే అనుకుని సోమ ఆమెను బెడ్రూమ్‌లో కూర్చోబెట్టింది. టీ చేసి తీసుకువస్తానని చెప్పి వంట గదిలోకి వెళ్లింది. సోమ తిరిగి వచ్చే సరికి ఆ మహిళ కనిపించలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటుందని ఊరుకుంది. 


కొద్దిసేపటి తర్వాత బీరువా తీసి చూస్తే అందులో ఉండాల్సిన రూ.50 వేల నగదు, 10 తులాల బంగారం కనిపించలేదు. షాకైన సోమ వెంటనే ఆ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పింది. వారు ఆ ఆగంతక మహిళ కోసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. అయితే ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-01-27T18:32:23+05:30 IST