చనిపోయిందని తేల్చిన యువతి.. పోలీస్ స్టేషన్‌కు రావడంతో..

ABN , First Publish Date - 2020-08-05T02:10:12+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. చనిపోయిందని పోలీసులు ప్రకటించిన ఓ యువతి.. పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.

చనిపోయిందని తేల్చిన యువతి.. పోలీస్ స్టేషన్‌కు రావడంతో..

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. చనిపోయిందని పోలీసులు ప్రకటించిన ఓ యువతి.. పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, పోలీసులు అవాక్కయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతిని కొందరు చంపి శవాన్ని సూట్‌కేసులో పెట్టి పారేశారు. ఆ శరీరాన్ని ఘజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం గుర్తుపట్టింది. దీంతో ఆ కుటుంబసభ్యురాలు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే చనిపోయిందని పోలీసులు ప్రకటించిన యువతి స్టేషన్‌కు చేరుకుంది. కట్నం కోసం భర్త వేధిస్తుండటంతో ఇంటి నుంచి తాను పారిపోయానని చెప్పింది. దీంతో జూలై 23న ఆమె భర్త మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ సమయంలో సూట్‌కేసులో దొరికిన శవం ఆమెదేనని ఆ కుటుంబం పొరబాటుపడింది.

Updated Date - 2020-08-05T02:10:12+05:30 IST