వైసీపీ నాయకుల ఇంటి ఎదుట మహిళ నిరసన

ABN , First Publish Date - 2021-04-14T22:58:37+05:30 IST

తనకు న్యాయం చేయాలని పిల్లలతో కలిసి వైసీపీ నాయకుల ఇంటి ఎదుట నిరసన చేపట్టింది.

వైసీపీ నాయకుల ఇంటి ఎదుట మహిళ నిరసన

కాకినాడ/ జగ్గంపేట: తనకు న్యాయం చేయాలని పిల్లలతో కలిసి వైసీపీ నాయకుల ఇంటి ఎదుట ఓ మహిళ నిరసన చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రౌతుపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు అంజిబాబు, చక్రధర్‌ల ఇంటివద్ద తన భర్త మృతదేహంతో పిల్లలతో కలిసి భార్య నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ గత నెల 21న లంపకలోవ గ్రామానికి చెందిన తన భర్త ప్రసాద్‌ను ట్రాక్టర్‌‌ను నడపడానికి డ్రైవర్‌గా చక్రధర్, అంజిబాబులు తీసుకెళ్లారని పేర్కొంది. అదేరోజు ట్రాక్టర్ బోల్తా పడటంతో ప్రమాదంలో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడని తెలిపింది. 


కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి ఆసుపత్రిలో ప్రసాద్ మృతి చెందాడని ఆమె పేర్కొంది. తన భర్త రానన్నా బలవంతంగా  తీసుకెళ్ళారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త మృతికి కారకులైన వ్యక్తులపై  చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం చేయాలనీ మృతుని భార్య లక్మీదేవి  ఏడాది, రెండేళ్ల పిల్లలతో  కలసి నిరసన చేపట్టింది. వారికి మద్దతుగా దళిత సంఘాలు నిలిచాయి. 

Updated Date - 2021-04-14T22:58:37+05:30 IST