కరోనా అని తల్లీబిడ్డలను వేరు చేశారు.. తీరా చూస్తే..

ABN , First Publish Date - 2020-07-14T03:05:55+05:30 IST

ఓ గర్భవతికి కరోనా అని నిర్ధారించిన వైద్యులు ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను వేరు చేశారు.

కరోనా అని తల్లీబిడ్డలను వేరు చేశారు.. తీరా చూస్తే..

చండీగఢ్: ఓ గర్భవతికి కరోనా అని నిర్ధారించిన వైద్యులు ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను వేరు చేశారు. బిడ్డకు పాలు పట్టడానికి కూడా ఆ తల్లికి అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే ఆ పసిబిడ్డకు కరోనా సోకే ప్రమాదముందని వైద్యులు భావించారు. అయితే ఆ తర్వాత ఆమెకు కరోనా లేదని తేలింది. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. దీనిపై ఆస్పత్రి వైద్యులు స్పందించారు. అదే పేరుతో ఉన్న మరో గర్భవతికి కరోనా ఉందని, దీంతో సిబ్బంది పొరబడ్డారని పేర్కొన్నారు. అంతేగాక ఒకేరోజున ఆ మహిళలిద్దరూ ప్రసవించడంతో సిబ్బంది పొరబడినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-14T03:05:55+05:30 IST