కిరోసిన్‌ పోసుకుని యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-01T16:51:45+05:30 IST

దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

కిరోసిన్‌ పోసుకుని యువతి ఆత్మహత్య

చెన్నై : క్రిష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని నళ్లూరులో గురువారం ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా... డెంకణీకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నళ్లూరుకు చెందిన శక్తివేల్‌కు శెంభగవళ్లి(22)లో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అదే విధంగా బుధవారం రాత్రి గొడవ జరుగగా, జీవితంపై విరక్తి చెందిన శెంబగవళ్లి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఆమె తల్లి మారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెంకణీకోట డీఎస్పీ సంగీత కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


Updated Date - 2021-01-01T16:51:45+05:30 IST