తనతో సహజీవనం చేసిన మహిళపై ఎస్ఐ కాల్పులు...

ABN , First Publish Date - 2020-09-28T14:53:54+05:30 IST

భార్యను వదిలి, ఓ మహిళతో ఏడాదిపాటు సహజీవనం చేసి...ఆమెపై కాల్పులు జరిపి రోడ్డుపై పడేసి వెళ్లిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు బాగోతం...

తనతో సహజీవనం చేసిన మహిళపై ఎస్ఐ కాల్పులు...

న్యూఢిల్లీ : భార్యను వదిలి, ఓ మహిళతో ఏడాదిపాటు సహజీవనం చేసి...ఆమెపై కాల్పులు జరిపి రోడ్డుపై పడేసి వెళ్లిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని లాహిరిగేటు ఎస్ఐ సందీప్ దహియా జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి అలీపూర్ ప్రాంతంలోని రోడ్డుపై పడి ఉండగా, ఆమెను మరో సబ్ ఇన్ స్పెక్టరు కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న మహిళ తనపై ఎస్ఐ సందీప్ దహియా కాల్పులు జరిపాడని పోలీసులకు చెప్పింది. భార్యతో విడిపోయిన సందీప్ దహియా తనతో ఏడాది పాటు సహజీవనం చేశాడని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. దీంతో ఎస్ఐ సందీప్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-28T14:53:54+05:30 IST