క్వారీ గుంతలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-09-24T16:50:25+05:30 IST

జీడిమెట్ల: జగత్గిరిగుట్ట పీఎస్ పరిధిలో మహదేవపురం వద్ద ఉన్న క్వారీ గుంతలో దూకి ఓ గృహిణి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.

క్వారీ గుంతలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

జీడిమెట్ల: జగత్గిరిగుట్ట పీఎస్ పరిధిలో మహదేవపురం వద్ద ఉన్న క్వారీ గుంతలో దూకి ఓ గృహిణి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. జీవితం మీద విరక్తితోనే లత(25) అనే వివాహిత ఆత్మహత్యాయత్నం చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. నెల క్రితం భర్త కుమార్‌తో గొడవ పడిన లత ఇద్దరు పిల్లలతో సెపరేట్‌గా నివాసం ఉంటోంది. నేడు మహదేవపురం వద్ద ఉన్న క్వారీ గుంతలో పిల్లలను ఒడ్డు వద్ద ఉంచి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. జగత్గిరిగుట్ట పోలీసులు, స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో లత కోసం క్వారీ గుంతలో గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-24T16:50:25+05:30 IST