మెటర్నిటీ ఆస్పత్రిలో మహిళ హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-01-17T22:27:13+05:30 IST

మెటర్నిటీ ఆస్పత్రిలో మహిళ హల్‌చల్‌ చేసింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ కాకుండానే తన బిడ్డ మాయమైందని డ్రామా ఆడింది. తన బిడ్డ లేదంటూ అలిపిరి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది.

మెటర్నిటీ ఆస్పత్రిలో మహిళ హల్‌చల్‌

తిరుపతి: మెటర్నిటీ ఆస్పత్రిలో మహిళ హల్‌చల్‌ చేసింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ కాకుండానే తన బిడ్డ మాయమైందని డ్రామా ఆడింది. తన బిడ్డ లేదంటూ అలిపిరి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. మెటర్నిటీ ఆసుపత్రి వద్ద శశికళ బంధువుల నిరసనకు దిగారు. శశికళ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో నెగటివ్ రిపోర్ట్ నమోదు చేశారు. శశికళకు పీసీవోడీ ఉన్నట్టు నెల్లూరు ఆస్పత్రి మెడికల్‌ రిపోర్టు ఇచ్చింది. శిశువుల్ని కిడ్నాప్‌ చేసేందుకు ఆస్పత్రిలో రెక్కీ నిర్వహించిందని మెటర్నిటీ ఆస్పత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-01-17T22:27:13+05:30 IST