డెలివరీకి కొద్ది నిముషాల ముందే తల్లిని కాబోతున్నానని తెలిసింది.. వెంటనే తల్లిని పిలిచి...

ABN , First Publish Date - 2021-10-09T13:26:34+05:30 IST

సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన వార్తలు కనిపిస్తుంటాయి.

డెలివరీకి కొద్ది నిముషాల ముందే తల్లిని కాబోతున్నానని తెలిసింది.. వెంటనే తల్లిని పిలిచి...

సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన వార్తలు కనిపిస్తుంటాయి. ఈ నేపధ్యంలోనే తాజాగా చోటుచేసుకున్న ఒక ఉదంతం హల్‌చల్ చేస్తోంది. ఒక మహిళకు తాను గర్భవతిని అనే విషయం తెలియలేదు. అయితే కడుపులో నొప్పివచ్చిన ఎనిమిది నిముషాల్లో బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిన్లాండ్‌లోని టర్కీకి చెందిన టిల్డా కంటాలాకు ఇటీవల కడుపులో నొప్పిగా అనిపించింది. ఇంతకుముందు తిన్న ఆహారమేదో పడలేదని, అందుకే కడుపునొప్పి వస్తున్నదని ఆమె భావించింది. అయితే రేండేళ్ల క్రితం ఆమె కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు కలిగిన నొప్పులు ఆమెకు గుర్తుకువచ్చాయి. మీడియాకు ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను తిన్న ఆహారమేదో పడకనే ఇలా జరిగిందని, ఇది సాధారణమైన నొప్పేనని భావించాను. అయితే కడుపులో ఏదో కదులుతున్నట్లు, తంతున్నట్లు అనిపించింది.


అపుడు అవి పురిటి నొప్పులు అని గ్రహించాను. కొద్దిసేపటిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలిసింది. వెంటనే ఏమి చేయాలో తెలియలేదు. మా అమ్మను పిలిచాను. అమ్మ నా అవస్థలు చూసి... నువ్వు గర్భవతివా? అని అని అడిగింది. నాకు అలానే అనిపిస్తోందని చెప్పాను. అప్పుడు ఆమె నా కడుపులో శిశువు తలను చూసింది.... తనకు లోపల శిశువు తల కనిపిస్తున్నదని, తలకు వెంట్రుకలు బాగా ఉన్నాయని చెప్పింది. తరువాత పుష్ చేయగలవా? అని అడిగింది. నేను అలా చేయలేనని చెప్పాను. దీంతో మా అమ్మ.. మామ సాయంతో అంబులెన్స్‌కు ఫోను చేసింది. ఇంతలో నేను పుష్ చేయడంతో ఒక శిశువు జన్మనిచ్చానని తెలిపింది. కాగా ఆ శిశువు జన్మించిన అనంతరం వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.  అక్కడి వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు చేశారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. టిల్డా కంటాలా తన ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్‌గా ఉన్నారు. 





Updated Date - 2021-10-09T13:26:34+05:30 IST