అమ్మ పట్టించుకోవడం లేదని అల్లుడిని చంపిన మహిళ

ABN , First Publish Date - 2021-08-22T22:29:43+05:30 IST

అమ్మ పట్టించుకోవడం లేదని అల్లుడిని చంపిన మహిళ

అమ్మ పట్టించుకోవడం లేదని అల్లుడిని చంపిన మహిళ

న్యూఢిల్లీ: మనవడి ఆనందంలో తనను తన అమ్మ పట్టించుకోవడం లేదన్న ఈర్శ్యతో ఓ మహిళ దారుణం చేసింది. రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపింది. అనంతరం ఎవరికీ కనిపించకుండా చిన్నారి మృతదేహాన్ని నాలాలో విసిరేసింది. అయితే సీసీ టీవీ కెమెరాలో సాయంతో సదరు మహిళ దుర్మార్గం బయట పడింది. ఢిల్లీలోని పంజాబ్‌బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు.


నిందితురాలి పేరు యమున (24). ఆమె భర్త పేరు రాజేశ్. ఢిల్లీలోని రఘుబీర్ ఖ్యాలా అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరు వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా తనను తల్లి పట్టించుకోవడం కోపం యమునకు పెరిగిపోయింది. దానికి కారణం తన అల్లుడైన రెండేళ్ల చిన్నారి. తన తల్లికి తనకు మధ్య చిన్నారి ఉండకూడదన్న అక్కసుతో భర్తతో కలిసి ఇంత దారుణానికి ఒడిగట్టింది. నిందితులిద్దరినీ అరెస్ట్ విచారిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-22T22:29:43+05:30 IST