సోషల్ మీడియాను ఊపేస్తున్న యువతి వీడియో!

ABN , First Publish Date - 2021-02-24T02:24:28+05:30 IST

కరోనా మహమ్మారి పుణ్యమా అని చిన్న, పెద్ద సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు

సోషల్ మీడియాను ఊపేస్తున్న యువతి వీడియో!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పుణ్యమా అని చిన్న, పెద్ద సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం నెమ్మదించడంతో చాలా కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోం’ వెసులుబాటును ఎత్తేశాయి. ఇక ఆఫీసుకు దయచేయండంటూ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి కార్యాలయానికి రావాల్సిందేనంటూ తనకు వచ్చిన ఈ-మెయిల్‌కు ఓ యువతి స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ వైరల్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. 


ఆ వీడియోలో యువతి మాట్లాడుతూ.. నా వరకు ఇది విషాద ఘటనే. మూడు రోజుల క్రితం ఇకపై ఆఫీసుకు రావాల్సిందేనని ఈ-మెయిల్ వచ్చింది. అంటే దానర్థం.. ఇక నుంచి దుప్పటి నుంచి త్వరగా బయటకు రావాలి. స్నానం చేయాలి. ఆఫీసుకు వెళ్లాలి. మళ్లీ ప్రజల ముఖాలు చూడాలి. ఇప్పుడిప్పుడే నా కళ్లకిందటి నల్లటి వలయాలు మాయమవుతున్నాయి. నా జీవితం మళ్లీ ట్రాక్‌లో పడుతోంది. చర్మం ఇప్పుడిప్పుడే మళ్లీ మెరుస్తోంది. ఇలాంటి సమయంలో మళ్లీ మీరు ఇలా’’ అన్న ఆమె వీడియో షోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె ఏమన్నదో మీరూ వినండి.   



Updated Date - 2021-02-24T02:24:28+05:30 IST