ఛీ.. ఛీ.. ఈమె అసలు తల్లేనా.. భర్తను వదిలేసి.. డబ్బుల కోసం 20 ఏళ్ల కూతురితో..

ABN , First Publish Date - 2021-11-03T15:22:37+05:30 IST

కుమార్తెను విక్రయించిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

ఛీ.. ఛీ.. ఈమె అసలు తల్లేనా.. భర్తను వదిలేసి.. డబ్బుల కోసం 20 ఏళ్ల కూతురితో..

కుమార్తెను విక్రయించిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని చూరూలో గల మహిళా పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. నిందితురాలిని పోలీసులు కోర్టుకు హాజరపరచగా, ఆమెను మూడు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి సత్పాల్ సింగ్ మాట్లాడుతూ బీహార్‌లోని మధుబనికి చెందిన 20 ఏళ్ల యువతి తన తల్లిపై ఫిర్యాదు చేసిందన్నారు. ఆమె తన ఫిర్యాదులో తల్లిపై పలు ఆరోపణలు చేసింది. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్తను విడిచిపెట్టేసిందని తెలిపింది. 


ఆ తరువాత తనను 2019లో హేమంత్ శర్మ అనే వ్యక్తికి అమ్మివేసిందని, అతను ఏడాది పాటు తనను బంధీగా మార్చి, తనపై అత్యాచారం జరుపుతూ వచ్చాడని తెలిపింది. అయితే ఇటీవల తన తల్లి హేమంత్ శర్మను డబ్బులు అడిగిందని, అతను నిరాకరించడంతో తనను అక్కడి నుంచి తీసుకువచ్చిన వాసుదేవ్ శర్మ అనే వ్యక్తికి మళ్లీ అమ్మేసిందని, అతను కూడా తనపై అత్యాచారం జరిపాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తరువాత వాసుదవ్ శర్మకు, తన తల్లికి డబ్బుల విషయంలో గొడవ రావడంతో తనను అక్కడి నుంచి తీసుకు వచ్చి, మరో వ్యక్తికి విక్రయించే ప్రయత్నం చేస్తున్నదని తెలిపింది. ఈ సమయంలోను తాను తన తల్లి నుంచి తప్పించుకుని వచ్చానని బాధితురాలు పేర్కొంది. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. పరారైన ఆమె తల్లి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

Updated Date - 2021-11-03T15:22:37+05:30 IST