ఆమెకు ముగ్గురితో సంబంధం.. ప్రియుడిని చంపి.. చివరికి...!

ABN , First Publish Date - 2021-07-09T18:52:38+05:30 IST

భర్తతో పాటు ముగ్గురితో సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన తొలి ప్రియుడిని..

ఆమెకు ముగ్గురితో సంబంధం.. ప్రియుడిని చంపి.. చివరికి...!

  • అడవిలో పడేసిన మహిళ
  • భర్తతో పాటు ఆరుగురి అరెస్టు 

చెన్నై/అడయార్‌ : భర్తతో పాటు ముగ్గురితో సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన తొలి ప్రియుడిని హత్య చేసి అటవీ ప్రాంతంలో పడేసింది. ఈ కేసులో ఆమె భర్తతో పాటు మొత్తం ఆరుమందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూరుకు సమీపంలోని పడప్రై, మురుగాత్తమ్మాళ్‌పేటకు చెందిన రాము (32) అనే వ్యక్తికి రేణుక (31) అనే మహిళతో 13 యేళ్ళక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే రాముకు పడప్పైకు చెందిన మహాలక్ష్మి (32) అనే మహిళతో సంబంధం ఏర్పడింది. ఒకే కంపెనీలో పనిచేస్తుండటంతో వీరిద్దరి మధ్య సంబంధం ఆరేళ్ళుగా కొనసాగుతూ వచ్చింది. 


మహాలక్ష్మికి భర్త మణి (39)తో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తన భర్త బాగోతం రేణుకకు తెలిసింది. దీంతో మహాలక్ష్మిని ఆమె మందలించింది. అయినప్పటికీ రాము, మహాలక్ష్మిల ప్రవర్తనలో మార్పురాలేదు. అదేసమయంలో మహాలక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన దినేష్‌ (21) అనే యువకుడితో సంబంధం ఏర్పడింది. అయినప్పటికీ రాముతో పాటు తన భర్త మణితో కూడా సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. అయితే, దినేష్‌ మహాలక్ష్మి పాత ప్రియుడు రాముతో సంబంధం కొనసాగించడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో మహాలక్ష్మితో కలిసి రామును హత్య చేసి, మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశారు. దీనిపై రాము భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో మహాలక్ష్మి, మణి, దినేష్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2021-07-09T18:52:38+05:30 IST