మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలి: తిరునగరి జ్యోత్స్నా
ABN , First Publish Date - 2020-09-19T00:26:25+05:30 IST
మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్నా డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ తెలుగు మహిళా ఆధ్వర్యంలో
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్నా డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ తెలుగు మహిళా ఆధ్వర్యంలో ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జ్యోత్స్నా మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమయిందని తప్పుబట్టారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా మహిళా కమిషన్ లేకపోవటం అన్యాయమన్నారు. మహిళాలపై సీఎం కేసీఆర్కు చిన్నచూపు తగదని హితవుపలికారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రభుత్వం మహిళ కమిషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని జ్యోత్స్నా స్పష్టం చేశారు.