పూరింటికి మంటలు: మహిళ సజీవదహనం
ABN , First Publish Date - 2022-01-29T04:52:55+05:30 IST
ద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరింటికి మంటలు వ్యాపించడం తో మతిస్థిమితం లేని మహిళ సజీవ దహనమైన దుర్ఘటన శుక్రవారం
ఏఎస్పేట, జనవరి 28: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరింటికి మంటలు వ్యాపించడం తో మతిస్థిమితం లేని మహిళ సజీవ దహనమైన దుర్ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఏఎస్పేటలో చోటుచేసుకుంది. గ్రామంలోని షాపబావి వద్ద ఓ వ్యక్తి సంరక్షణలో కొంత మంది మానసిక రోగులు ఉంటున్నారు. వారు ఉండే ఇంటి ఆవరణలోనే పూరిల్లు కూడా ఉంది. ఈ క్రమంతో గురువారం రాత్రి ఇద్దరు మానసిక మహిళలు పూరింటిలోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు ఒక మహిళను బయటకు తేవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. హైదరాబాదుకు చెందిన మరో మహిళ ఫాతిమా ముష్రఫ్ (47) మంటల్లోనే చిక్కుకుంది. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలు అదుపు చేసే లోగా ఆమె సజీవ దహనం అయింది. ఆత్మకూరు సీఐ వేణుగోపాల్రెడ్డి, ఏఎస్పేట ఎస్ఐ సుబహని ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.