ప్రియుడి మోజులో కన్నబిడ్డలకు ఉరి

ABN , First Publish Date - 2021-10-12T06:54:29+05:30 IST

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 11: నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లే.. ప్రియుడి మోజులో పడి తన బిడ్డలను ఉరివేసి హత్య చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకా రం.. సీతానగరానికి చెందిన పూరేటి లక్ష్మీఅనూషకు 11 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి చిన్మయి(8), మోహిత్‌ సత్యసాయి(6) ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల క్రితం

ప్రియుడి మోజులో కన్నబిడ్డలకు ఉరి
పిల్లలను హత్య చేసిన తల్లి లక్ష్మీఅనూష.. చిన్మయి, శ్రీసత్య సాయి మృతదేహలు

రాజమహేంద్రవరంలో దారుణం

పోలీసుల అదుపులో నిందితులు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 11: నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లే.. ప్రియుడి మోజులో పడి తన బిడ్డలను ఉరివేసి హత్య చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకా రం.. సీతానగరానికి చెందిన పూరేటి లక్ష్మీఅనూషకు 11 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి చిన్మయి(8), మోహిత్‌ సత్యసాయి(6) ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల క్రితం భర్త మృతిచెందడంతో అనూష తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంది. త ర్వాత శివరామకృష్ణ అనే వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది. అతనితో సక్రమంగా కాపురం చేయకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఆనంద్‌నగర్‌లో ఉంటూ బ్యూటీషియన్‌గా పని చేస్తూ వడ్డీవ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక సీతంపేటకు చెందిన సతీ్‌షతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించిన అనూష.. వారిని కొట్టడం, తిట్టడం చేస్తుండేది. ఈ విషయమై నిలదీసిన తల్లిని కూడా అనూష కొట్టడంతో ఆమె మెడకు గాయమై ఆస్పత్రిపాలైంది. జరిగిన ఉదంతాన్ని అనూష తమ్ముడు పండు.. తమ మేనమామకు తెలిపాడు. ఆయన అనూషకు ఫోను చేసి మందలించాడు. అయి తే ప్రియుడితో ఉండేందుకు పిల్లలు అడ్డంకిగా మారుతున్నారని కక్షపెంచుకున్న అనూష.. ఆదివారం అర్ధరాత్రి పిల్లలిద్దరికీ ఇంట్లోనే చున్నీతో ఉరివేసి హత్యచేసింది. తాను కూడా ఉరివేసుకుంటున్నట్టు ప్రియుడికి, సోదరుడికి ఫోను చేసింది. వారు అక్కడికి వెళ్లి ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనూషను, ఆమె ప్రియుడు సతీ్‌షను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు త్రీటౌన్‌ సీఐ మధుబాబు తెలిపారు.

Updated Date - 2021-10-12T06:54:29+05:30 IST