మహిళల వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ రద్దు

ABN , First Publish Date - 2021-11-28T08:49:50+05:30 IST

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్‌ కోసం జింబాబ్వేలో జరుగుతున్న ..

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ రద్దు

దుబాయ్‌: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్‌ కోసం జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది. దీంతో ర్యాంకింగ్స్‌ ఆధారంగా పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లకు మెగా టోర్నీ బెర్త్‌లు ఖరారయ్యాయి. ప్రపంచకప్‌ అర్హత పోటీల కోసం 9 జట్లు తలపడనుండగా.. వీటి నుంచి మూడు జట్లు 2022లో న్యూజిలాండ్‌లో జరిగే వరల్డ్‌క్‌పనకు అర్హత సాధిస్తాయి. న్యూజిలాండ్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌, దక్షిణాఫ్రికా ముందుగానే టోర్నీ బెర్త్‌ దక్కించుకోగా.. మిగిలిన మూడు బెర్త్‌లను పాక్‌, విండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు చేజిక్కించుకున్నాయి. కాగా, కరోనా కొత్త వేరియంట్‌ విజృంభణతో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ అర్ధంతరంగా వాయిదా పడింది.  

Updated Date - 2021-11-28T08:49:50+05:30 IST